అమరావతిలో ఆ రైతులకు బాబు షాక్: భూసేకరణకు నోటిఫికేషన్
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో రాజధాని నిర్మాణం పేరిట భూసేకరణకు మరో నోటిఫికేషన్ జారీ అయ్యింది. అమరావతి పరిధిలోని నేలపాడులో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే మెజారిటీ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వగా 45 మంది రైతులు అందుకు ససేమిరా అన్నారు.
ఇప్పటికే సేకరించిన భూముల మధ్యలో చిన్న చిన్న బిట్లుగా ఉన్న 27 ఎకరాల భూమి సేకరణకు ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ల్యాండ్ పూలింగ్ పధ్ధతిలో భూమిని సేకరించనున్న ప్రభుత్వం భూయజమానులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తుంది.
నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో సదరు భూముల క్రయ విక్రయాలపై నిషేధం విధిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ పైన అభ్యంతరాలుంటే రెండు నెలల్లో తెలపాలని భూమి యజమానులకు ప్రభుత్వం సూచించింది.
amaravati capital chandrababu naidu andhra pradesh land acquisition అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ భూసేకరణ
English summary
Land acquisition notification in Andhra Pradesh capital Amaravati.
Story first published: Friday, July 22, 2016, 10:41 [IST]