Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెన్షన్ల పెంపు: పెంచింది లోలెవల్.. ప్రచారం పీక్ లెవల్లో; అవసరమా జగన్: లంకా దినకర్

బీజేపీ నేత లంకా దినకర్ ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ పెంపును నేటి నుండి అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చిటికెడు పెన్షన్ కి బారెడు ప్రకటనలు అవసరమా అంటూ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు బిజెపి నేత లంకా దినకర్. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ నేతలు తాజాగా ఏపీ సర్కార్ పెన్షన్ పెంపును టార్గెట్ చేస్తున్నారు.

రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వటం కన్న పీకటానికే ఎక్కువ కసరత్తు

రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వటం కన్న పీకటానికే ఎక్కువ కసరత్తు

రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడానికన్నా, పెన్షన్లు పీకడానికే కసరత్తు ఎక్కువ చేశారంటూ లంకా దినకర్ ఎద్దేవాచేశారు. చిటికెడు పెన్షన్ ను పెంచి బారెడు ప్రకటనలు చేయటం అవసరమా జగన్ గారు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ టి ఎస్ వసూళ్లు, మద్యం వసూళ్లు, మైనింగ్ వసూళ్లతో పాటు చెత్త మీద వసూళ్ళు కూడా పెరిగిపోయాయని లంకా దినకర్ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు సీఎం జగన్ పెంచుతాం అని చెప్పిన పెన్షన్ ఎంత? ప్రస్తుతం ఇస్తున్నది ఎంత అంటూ లంకా దినకర్ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.

పెంచింది లో లెవెల్ లో అయినా ప్రచారం మాత్రం పీక్ లెవల్లో

పెంచింది లో లెవెల్ లో అయినా ప్రచారం మాత్రం పీక్ లెవల్లో

అత్తెసరు పెన్షన్ పెంపు కూడా ప్రభుత్వ ధనంతో తన ఫోటో కనబడటం కోసమే జగన్ పత్రిక ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ పేమెంట్ పెంచింది లో లెవెల్ లో అయినా ప్రచారం మాత్రం పీక్ లెవల్లో అంటూ లంకా దినకర్ జగన్ సర్కార్ పై సెటైర్లు వేశారు రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడానికన్నా, పీకడానికి కసరత్తులు ఎక్కువ చేశారని లంకా దినకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పెంచింది 250 కానీ ప్రచార ఆర్భాటానికి లక్షల ప్రజాధనం దుర్వినియోగం అంటూ ఆగ్రహం

పెంచింది 250 కానీ ప్రచార ఆర్భాటానికి లక్షల ప్రజాధనం దుర్వినియోగం అంటూ ఆగ్రహం

జగన్ మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచి నానా హంగామా చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో జగన్ పై విరుచుకు పడుతున్నారు. ఇక అవ్వా తాతలకు మూడు వేళా రూపాయలు ఇవ్వలేని జగన్ రెడ్డి మూడు రాజధానులు కడతారా అంటూ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సీఎం జగన్ కేవలం 250 రూపాయలు పెంచి లక్షల రూపాయల ప్రజా ధనాన్ని ప్రచార ఆర్భాటాలకు వృధా ఖర్చు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు .

గుంటూరు జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ పెంపు కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్

గుంటూరు జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ పెంపు కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్

ఇదిలా ఉంటే నూతన సంవత్సర శుభవేళ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో వైయస్సార్ పెన్షన్ కానుక పెంపు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను వృద్ధులకు సీఎం జగన్ పంపిణీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని, మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నానని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం పెన్షన్ పంపిణీ

ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం పెన్షన్ పంపిణీ


అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్ పైనే చేశారని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు జనవరి ఒకటవ తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ దారులకు 250 రూపాయల పెన్షన్ లో అదనంగా పెంచుతూ మొత్తం 2,500 రూపాయల పెన్షన్ ను వారికి అందించనున్నారు జనవరి ఒకటవ తేదీ నుండి 5 రోజులపాటు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం పెరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+