శాంతి భద్రతల పర్యవేక్షణే ముఖ్యం, గతంలో జగన్ను అరెస్ట్ చేయలేదా: స్పీకర్ తమ్మినేని
ఏపీలో రాజధాని మార్పుపై ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్నాయి. మరోవైపు నేతల మధ్య మాటల కోటలు దాటుతున్నాయి. రాజధాని మార్పుపై వ్యతిరేకంగా విపక్ష టీడీపీ, అనుకూలంగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాలని టీడీపీ నేత బోండా ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు.

ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సభ్యత మరిచారని స్పీకర్ తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలను అరెస్ట్ చేయలేదా అని ప్రశ్నించారు. మీరు చేస్తే కరెక్ట్.. మేం చేస్తే తప్పా అని అడిగారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నిలిపివేయలేదా అని ప్రశ్నించారు.
నిరసనకు దిగే సమయంలో శాంతి భద్రతల గురించి చంద్రబాబు ఆలోచించాలని సూచించారు. 14 ఏళ్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా అనుభవం ఉంది కదా అని అడిగారు. అలా కాకుండా ఇస్టానుసారం వెళ్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకుంటారని, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications