వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది ఎన్టీఆర్‌తో మైత్రి బంధమే: అక్కినేనిపై లక్ష్మీపార్వతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: అనేక మంచి పాత్రలలో నటించి తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వర రావు అని నందమూరి లక్ష్మీ పార్వతి కొనియాడారు. సంవత్సరాలు వేరైనా మహనీయుడు ఎన్టీఆర్ మరణించి జనవరి నెలలోనే అక్కినేని మృతి చెందడం యాదృచ్ఛికమైనా వారి ఇరువురి మైత్రికి అనుబంధంగా భావిస్తున్నానని చెప్పారు.

చాణక్య, చంద్రగుప్తులు: బాబుమోహన్

తెలుగు చిత్ర రంగానికి రెండు కళ్లు అయిన ఎన్టీఆర్, ఎఎన్నార్ ఇద్దరూ మనల్ని వదిలి పెట్టి వెళ్లిపోయారని అయితే, వారిద్దరు స్వర్గంలో కలుసుకున్నారని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత బాబుమోహన్ అన్నారు. అక్కినేని తనను రెండుమూడుసార్లు మాత్రమే పేరు పెట్టి పిలిచి ఉంటారని గుర్తు చేసుకున్నారు.

ఇటీవలే ఎన్టీఆర్, ఎఎన్నార్‌లు నటించిన చాణక్య చంద్రగుప్తులను చూసి మురిసిపోయానన్నారు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలంటే వీరే అన్నారు. అక్కినేని ఆత్మకు శాంతికలగాలని, ఆ కుటుంబానికి ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని తాను దేవుడిని కోరుకుంటున్నానన్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

అక్కినేని నాగేశ్వర రావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి డికె అరుణ చెప్పారు. అక్కినేని భౌతికకాయాన్ని ఆమె సందర్శించి నివాళులు అర్పించారు.

English summary
NTR TDP president Nandamuri Laxmi Parvathi on Wednesday condole for Akkineni Nageswara Rao's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X