ట్విట్టర్లో పత్రం: ఆగస్టు 1న విజయవాడకు సచిన్!
హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు రానున్నారు. విజయవాడలో పివిపి సంస్థ ఏర్పాటు చేయనున్న ఓ బిజినెస్ మాల్ను సచిన్ టెండూల్కర్ ప్రారంభించనున్నారని పివిపి సంస్థ తన ఆహ్వాన పత్రంలో పేర్కొంది. ఈ పత్రాన్ని ట్విట్టర్లో కూడా పోస్టు చేసింది.
పివిపి మాల్ను విజయవాడలో ఆగస్టు 1వ తేదీన సచిన్ టెండూల్కర్ ప్రారంభించనున్నారని ట్విట్టర్లో ఆహ్వాన పత్రాల పోస్టింగ్ జోరందుకుంది. అయితే పివిపి సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దాదాపు 25 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో భారత తరపున ఆడి అనేక రికార్డులను తన పేరున రాసుకున్న సచిన్ టెండూల్కర్ 2013, నవంబర్ లో జరిగిన వెస్టిండీస్ టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications