లేపాక్షి షోరూంలో మట్టి వినాయక విగ్రహాలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని లేపాక్షి షోరూంలో మట్టి వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు. వివిధ రూపాల్లో మట్టి ప్రతిమలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. అమ్మకాలు ఆగస్టు 29 వరకు జరుగుతాయని లేపాక్షి మేనేజర్ విజయసారథి తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాల విక్రయాలు చేపట్టామని ఆయన చెప్పారు.
శరవేగంగా ఖైరతాబాద్ గణనాథుని విగ్రహ తయారీ
దేశంలోనేకాక ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ గణనాథుని విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు ప్రారంభమై 60 సంవత్సరాలు కావడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం మొదటిసారి జరగనున్న ఈ ఉత్సవాలకు మరింత ప్రత్యేకత సంతరించుకోనుంది. మే 28న కర్రపూజతో ప్రారంభమైన ఈ పనులు జూన్ 4న షెడ్ నిర్మాణం అనంతరం బేస్ల నిర్మాణం, షెడ్ నిర్మాణం పూర్తి చేసుకుంది.
కుల, మత, ప్రాంతాలకతీతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, కలకత్తా, గోవా రాష్ట్రాలకు చెందిన కార్మికులు తోపాటు మహాగణపతి ఫినిషింగ్ పనులను మహ్మద్, కబీర్ నిర్వహించడం ఇక్కడ జరిగే వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకువస్తున్నది. మొదటగా ఆదిలాబాద్కు చెందిన సుధాకర్ ఆధ్వర్యంలోని 15 మంది బృందం సుమారు 10 రోజులు శ్రమించి షెడ్ పనులను పూర్తిచేశారు. అనంతరం విశాఖపట్నంకు చెందిన శేషాద్రి ఆధ్వర్యంలో 25 మంది వెల్డింగ్ పనుల్లో పాల్గొన్నారు.
శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది కార్మికులు రోజుకు 16 నుంచి 18 గంటలు మహాగణపతి నిర్మాణం పనుల్లో వున్నారు. ఈసారి కైలాస విశ్వరూప మహాగణపతి ఆకారంలో గణనాథున్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. విశ్వకళ్యాణాన్ని కాంక్షిస్తూ కైలాస విశ్వరూప మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచామని అన్నారు. ఇందులో భాగంగా 60 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో తయారు చేస్తున్నట్లు చెప్పారు.

వినాయకులు
నగరంలోని ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని లేపాక్షి షోరూంలో మట్టి వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు.

వినాయకులు
లేపాక్షి షోరూంలో వివిధ రూపాల్లో మట్టి ప్రతిమలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు.

వినాయకులు
అమ్మకాలు ఆగస్టు 29 వరకు జరుగుతాయని లేపాక్షి మేనేజర్ విజయసారథి తెలిపారు.

వినాయకులు
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాల విక్రయాలు చేపట్టామని ఆయన చెప్పారు.

వినాయకులు
లేపాక్షి షోరూంలో వివిధ రూపాల్లో కొలువుదీరిన మట్టి వినాయక విగ్రహాలు.

వినాయకులు
లేపాక్షి షోరూంలో వివిధ రూపాల్లో కొలువుదీరిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలిస్తున్న సందర్శకులు.

వినాయకులు
లేపాక్షి షోరూంలో వివిధ రూపాల్లో కొలువుదీరిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలిస్తున్న సందర్శకులు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications