VV Lakshminarayana: మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణకు ప్రాణహాని ?
ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో విశాఖ ఎంపీ సీటులో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈసారి సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
విశాఖ ఉత్తర సీటు నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వీవీ లక్షీనారాయణ తనకు ప్రాణహాని ఉందంటూ విశాఖ సీపీ రవి శంకర్ అయ్యన్నార్ కు ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీబీఐ మాజే జేడీని ఎన్నికల సమయంలో చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.


విశాఖ ఉత్తర సీటులో వీవీ లక్ష్మీనారాయణతో పాటు వైసీపీ తరఫున కేకే రాజు, బీజేపీ తరపున కూటమి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ పోటీతో ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్ధులు కేకే రాజు, విష్ణుకుమార్ రాజు మధ్య ఓట్లు చీలే అవకాశముంది. ఇలాంటి సమయంలో లక్ష్మీనారాయణ ప్రాణహాని ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం: ఎయిర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ విధింపు -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?











Click it and Unblock the Notifications