ఇళ్లు కూల్చుతారనే వార్తలు మనోవేదనకు గురి చేస్తున్నాయి... సీఎంకు లేఖ రాసిన లింగమనేని
బాద్యతగల పౌరుడిగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇళ్లు ఇచ్చానని లింగమనేని రమేష్ తెలిపాడు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూల్చివేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన సీఎం జగన్ మోహన్రెడ్డికి లేఖ రాశారు. తన ఇంటిని కూల్చివేస్తారని వస్తున్న వార్తలపై తాను ఆవేదన చెందుతున్నట్టు ఆయన లేఖలో పేర్కోన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఉండవల్లి పంచాయితీ నుండి అన్ని అనుమతులు తీసుకున్నానని లేఖలో పేర్కోన్నారు. నిబంధనల ప్రకారమే ఇంటిని నిర్మించానని చెప్పుకోచ్చారు. ఇక ఇంటి నిర్మాణంపై గతంలోనే సీఆర్డీఏ అధికారులకు కూడ వివరణ ఇచ్చానని తెలిపారు.
మరోవైపు చంద్రబాబు నాయుడుకు ఇళ్లు ఇవ్వడంతో ఆయన బినామిగా పేర్కోంటూ ప్రచారం జరగుతుందని చెప్పారు. ఈ ప్రచారంతో పాటు ఇళ్లు కూల్చివేతలపై వస్తున్న వార్తలు తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన సుమారు 22 ఇళ్లకు నోటిసులు ఇచ్చామని చెబుతున్న అధికారులు వారి నుండి వివరణలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే నిర్మాణలపై వివరణ సరిగా లేని కొన్న అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు నడుం బిగించారు. దీంతో సోమవారం ఉదయం కరకట్టపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇందులో బాగంగానే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి కూడ నోటీసులు పంపిణ అధికారులు దాన్ని కూల్చి కూల్చివేసేందకు అధికారులు చర్యలు చేపట్టినట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలోనే మంత్రి బోత్స సత్యనారయణ సైతం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేయడం లేదని స్పష్టం చేశారు.