వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదో రోజు అదే సీన్: ప్రారంభమైన 6 ని.లకే లోకసభ వాయిదా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోకసభలో పదో రోజు కూడా అదే తంతు. కేంద్రంపై మంగళవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా చర్చకు రాలేదు. లోకసభ ప్రారంభం కాగానే సభ్యులు అవిశ్వాస తీర్మానానికి, కావేరీ బోర్డు ఏర్పాటుకు.. ఇలా పలు పార్టీలు పలు డిమాండ్లతో నిరసన తెలిపాయి.

పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు బాబు, కాంగ్రెస్‌ను కలవడంపై సందిగ్ధం!: బీజేపీ మినహా విపక్ష నేతలతో భేటీ!!పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు బాబు, కాంగ్రెస్‌ను కలవడంపై సందిగ్ధం!: బీజేపీ మినహా విపక్ష నేతలతో భేటీ!!

Lok Sabha adjourned till 12 noon

దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన ఆరు నిమిషాల్లోనే వాయిదా పడింది. ప్రధానంగా తమిళనాడు ఎంపీలు కావేరీ బోర్డు కోసం డిమాండ్ చేయడంతో సభ సజావుగా సాగడం లేదు. మరోవైపు రాజ్యసభలో కూడా అదే పరిస్థితి కనిపించింది.

ఆ తర్వాత పన్నెండు గంటలకు ప్రారంభమైన లోకసభ బుధవారానికి వాయిదా పడింది. సభ ఆర్డర్‌లో లేదని స్పీకర్ లోకసభను వాయిదా వేశారు. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలంటే సభ ఆర్డర్‌లో ఉండాలని కేంద్రమంత్రి అనంత్ కుమార్ అన్నారు.

English summary
Lok Sabha was adjourned till noon within six minutes of starting proceedings, with Tamil Nadu MPs launching their demand the formation of a Cauvery Management Board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X