‘పట్టిసీమ పూర్తయితే జగన్ పార్టీ గల్లంతే’
కడప: పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పట్టిసీమపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే పిల్ల కాంగ్రెస్ కనుమరుగవుతుందని అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని కార్యాలయంలో పార్టీ జెండాను బుధవారం లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని వివరించారు.
మనుగడ కోసమే జగన్ యాత్ర: చిన్నరాజప్ప

రాజకీయ మనుగడ కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్ర చేపట్టారని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప ఆరోపించారు. ఈడీ కేసులపై జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని స్పష్టం చేశారు.
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అసలు నిందితుల పేర్లను బయటకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈడి కేసులపై జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని మంత్రి చిన్న రాజప్ప నిలదీశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications