జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ అనగానే సీఎం జగన్ పారిపోతున్నాడు.. పిరికిపంద; రాజీనామా చెయ్: లోకేష్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతల ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారవుతోందని లోకేష్ ఆరోపించారు. ఇంకా ఎంత మంది మరణిస్తే సీఎం జగన్ స్పందిస్తారో చెప్పాలని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సారా మరణాలన్నీ వైఎస్ జగన్ హత్యలే.. వైసీపీ నాటుసారా మాఫియా: లోకేష్ ఆగ్రహం
జంగారెడ్డి గూడెం ఘటన.. సీఎం జగన్ రాజీనామాకు లోకేష్ డిమాండ్
శాసనమండలిలో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మరణాలపై ప్రభుత్వం ఎందుకు చర్చకు రావడం లేదని లోకేష్ ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలను సీఎం జగన్ సహజ మరణాలుగా పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. సహజ మరణాలైతే ఎస్ఏఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై సీఎం జగన్ రాజీనామా చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై సభాహక్కుల నోటీసు ఇచ్చామని, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని లోకేష్ ప్రశ్నించారు.
జంగారెడ్డి గూడెం వాసి వరదరాజులు కల్తీమద్యం త్రాగి మరణించాడు
టీడీపీ
జాతీయ
ప్రధాన
కార్యదర్శి
నారా
లోకేష్
ముఖ్యమంత్రి
వై.ఎస్.
తాజాగా
జంగారెడ్డిగూడెం
వాసి
వరదరాజులు
మృతిని
జగన్
మోహన్
రెడ్డి
సహజ
మరణంగా
అభివర్ణించారని
మండిపడ్డారు.
తన
భర్త
తీవ్ర
అస్వస్థతకు
గురయ్యాడని,
చివరకు
కల్తీ
మద్యం
తాగిన
తర్వాతే
చనిపోయాడని
వరదరాజులు
భార్య
స్పష్టంగా
చెబుతోందని
లోకేష్
అన్నారు.
వరదరాజులు
జంగారెడ్డిగూడెంలో
కల్తీ
మద్యం
తాగి
గుంటూరు
ప్రభుత్వ
ఆసుపత్రికి
వచ్చి
చికిత్స
పొందుతూ
మృతి
చెందిన
విషయం
అందరికీ
తెలుసు
అని
పేర్కొన్నారు.
జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ జరగకుండా సీఎం పారిపోతున్నాడు
సభలో
జంగారెడ్డిగూడెం
మద్యం
మరణాలపై
చర్చ
జరగకుండా
ముఖ్యమంత్రి
పారిపోతున్నారని
జగన్మోహన్రెడ్డిని
టార్గెట్
చేశారు.
పిరికిపందల్లా
సీఎం,
ఆయన
మంత్రులు
పరస్పర
విరుద్ధ
ప్రకటనలు
చేస్తూ
గందరగోళం
సృష్టిస్తున్నారన్నారు.
జగన్
రెడ్డి
మరణాలన్నీ
సహజ
మరణాలు
అని
చెబుతుంటే,
కల్తీ
మద్యం
వల్ల
నాలుగు
నుంచి
ఆరు
మరణాలు
సంభవించాయని
మంత్రి
చెబుతున్నారు.
వైయస్
జగన్,
వారి
మంత్రులు
చెప్పేవాటికి
ఒకదానికొకటి
పొంతన
లేవని
మండిపడ్డారు.
తప్పుడు ప్రకటన చేసినందుకు సీఎంపై ప్రివిలేజ్ నోటీసులు
విలువలున్న
నాయకుడు
అయితే
సీఎం
జగన్
రెడ్డి
తక్షణం
రాజీనామా
చేయాలని
నారా
లోకేశ్
డిమాండ్
చేశారు.
అసెంబ్లీని
తప్పుదోవ
పట్టించినందుకు,
ప్రజలకు
ద్రోహం
చేసినందుకు
ముఖ్యమంత్రి
రాజీనామా
చేయాలన్నారు
.
సభలో
తప్పుడు
ప్రకటనలు
చేసినందుకు
ఆయనపై
ప్రివిలేజ్
నోటీసు
ఇచ్చామని
పేర్కొన్నారు.బడుగు
బలహీన
వర్గాల
మరణాలను
లెక్కచేయకుండా
మద్యం
ఆదాయాన్ని
పెంచుకునేందుకు
జగన్
మోహన్
రెడ్డి
మొగ్గు
చూపడం
క్షమించరానిదని
లోకేష్
అన్నారు.
మరణించిన
కుటుంబాలకు
నష్ట
పరిహారం
ఇచ్చే
వరకు
ఆందోళన
కొనసాగిస్తామన్నారు.
న్యాయ విచారణ జరగాలి, 25 లక్షల పరిహారం ఇవ్వాలి : లోకేష్ డిమాండ్
26 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నిజానిజాలు బయటకు రావాలంటే న్యాయ విచారణకు ఆదేశించాలని లోకేష్ పేర్కొన్నారు. 18,300 లీటర్ల కల్తీ మద్యం ధ్వంసం చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నా సీఎం అబద్ధాలు ఎలా చెబుతారని టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ప్రశ్నించారు. కొనసాగుతున్న అక్రమ మద్యం మరణాలకు ప్రభుత్వ దుర్మార్గపు విధానాలే కారణమని స్పష్టం చేశారు. కల్తీ మద్యం బాధితులు బడుగు బలహీన వర్గాల వారు కాబట్టే జగన్ రెడ్డి ఈ వివక్ష చూపుతున్నారా అని లోకేష్ ప్రశ్నించారు.
Recommended Video
సొంత బాబాయినే చంపి సహజ మరణం అన్నారు
వరదరాజులు
కల్తీ
మద్యం
వల్లే
చనిపోయాడని
పోస్ట్మార్టం
నివేదిక
కూడా
పేర్కొంది.
అప్పుడు
కూడా
అధికార
పార్టీ
నేతలు
తమ
తప్పును
అంగీకరించడం
లేదని
లోకేష్
విమర్శించారు.
వైయస్
కుటుంబం
తమ
సొంత
బాబాయిని
చంపి,
ఆపై
దానిని
'గుండెపోటు'గా
చిత్రీకరించడానికి
ప్రయత్నించిన
వారని,
ఇప్పుడు
జంగారెడ్డిగూడెం
మరణాలు
సహజ
మరణాలుగా
చిత్రీకరించడానికి
ప్రయత్నిస్తున్నారని
ఆరోపించారు.
జంగారెడ్డిగూడెంతో
పాటు
ఇతర
ప్రాంతాల్లో
కల్తీ
మద్యం
బాధితులు
మృతి
చెందగా,
వారి
చిరునామాలు,
కారణాలు
వంటి
వివరాలు
తెలుసుకొని
ప్రభుత్వంపై
పోరాటం
చేయడానికి
తెలుగుదేశం
పార్టీ
సిద్ధం
అవుతోందని
లోకేష్
పేర్కొన్నారు.