చంద్రబాబు చిక్కింది అక్కడేనా, వాదనల్లో పస లేదా - ఎక్కడ లోపం..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu) స్కిల్ కేసు ఎదర్కోవాల్సిందేనా. హైకోర్టులో క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయటంతో ఇప్పుడు ఏం చేయబోతున్నారు. హైకోర్టు(High Court)లో క్వాష్ పిటీషన్ డిస్మిస్ వేళ న్యాయమూర్తి పేర్కొన్న అంశాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఈ తీర్పు పైన సుప్రీంకు వెళ్తే ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో అసలు చంద్రబాబు మద్దతు దారులు సాంకేతిక అంశాలే మినహా, ఎక్కడా అసలు ఎందుకు తప్పు చేయలేదని చెప్పటం లేదనే చర్చ సామాన్యుల్లో వినిపిస్తోంది.
చంద్రబాబు కేసులో వరుసగా : చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా...న్యాయ పరంగా చంద్రబాబు(Chandra Babu) వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కర చర్చకు దారి తీసింది. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ సమయంలో చంద్రబాబు అరెస్ట్.. సీఐడీ కేసు పైన టీడీపీ నమ్ముకున్న వారు ప్రధానంగా సాంకేతిక అంశాలనే ప్రస్తావించారనే అభిప్రాయం ఉంది.

ఎక్కడా చంద్రబాబు తప్పు చేయలేదనే విధంగా బలమైన వాదనలు జరగలేదనే చర్చ టీడీపీలోనే వినిపిస్తోంది. వైసీపీ(YCP) నేతలు సైతం పదే పదే సాంకేతిక అంశాలే మినహా..తమ నేత తప్పు చేయలేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఏం జరుగుతోంది : ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు(High Court)లో క్వాష్ పిటీషన్ సమయంలోనే టీడీపీ(TDP) మద్దతు దారుల నుంచి ఇవే రకమైన వ్యాఖ్యలు వినిపిపించాయి. పార్టీలోనూ..బయటా చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ నినదించిన వారు సైతం చంద్రబాబు తప్పు చేయలేదని మాత్రం గట్టిగా ఎక్కడా వాదించిన దాఖలాలు లేవు. రాజకీయ కక్ష్యతో అరెస్ట్ చేసారని ఆరోపణలు..గవర్నర్ అనుమతులు..అవినీతి నిరోధక చట్టం వంటి సాంకేతిక అంశాల చుట్టూనే పార్టీ ముఖ్యులు మాట్లాడటం కనిపించింది.
అసెంబ్లీ(Assembly)లో ప్రభుత్వం చంద్రబాబు స్కిల్ స్కాం పైన తప్పు చేసారని ఆధారాలు చూపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అప్పటి వరకు చంద్రబాబు కేసుల గురించి రాద్దాంతం చేసి తమ అధినేత తప్పు లేదని వాదించాల్సిన సమయంలో సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.

బెయిల్ కోసం ప్రయత్నాలు : ఇదే సమయంలో క్వాష్ పిటీషన్ ద్వారా పూర్తిగా కేసు నుంచి బయట పడే ప్రయత్నాలు చేసారు. కానీ, బెయిల్ గురించి ఆలోచన చేయలేదు. బెయిల్ పిటీషన్(bail Petition) ఆలస్యం చేయటం..అదే సమయంలో సీఐడీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పీటీ వారెంట్ల పైన మాత్రం బెయిల్ కోసం హైకోర్టు(High Court)ను ఆశ్రయించటం పైనా భిన్నాభిప్రాయాలు వినిపించాయి. జైలులో చంద్రబాబును కలిసిన తరువాత కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు జైలులో దోమలతో కుట్ర చేస్తున్నారు, వేడి నీళ్లు లేవు, ఏసీ ఏర్పాటు చేయలేదు వంటి అంశాల ప్రస్తావనతో అసలు చంద్రబాబు కేసు సీరియస్ నెస్ తగ్గటానికి కారకులుగా నిలిచారనేది మరో అభిప్రాయం.
ఇప్పుడు బెయిల్ కోసం ఏసీబీ కోర్టు(ACB Court)లో పిటీషన్ పైన సోమవారం విచారణ జరగనుంది. ఇప్పటి వరకు ఎన్నో కేసులను న్యాయ పరంగా ఎదుర్కొన్న చంద్రబాబు..ఈ కేసులో మాత్రం అనుకున్నది ఒకటి..అవుతుంది మరొకటి అన్నట్లుగా అనూహ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications