చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంటాడ్డంతో బావిలో పడిన ప్రేమజంట, యువతి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

girl dead in Chittoor district
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని నెల్లేపల్లి మండలం లక్ష్మీరెడ్డి పల్లిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి పారిబోతున్న ప్రేమ జంటను బంధువులు వెంటాడిన ఘటనలో యువతి మృతి చెందింది. ఆ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మీనా, చిట్టిబాబు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్న వీరు క్రిస్మస్ సెలవుల సందర్భంగా స్వస్థలానికి వచ్చారు.

ఈ క్రమంలో మీనా, చిట్టిబాబు, వారి స్నేహితుడు శివరాజు బైక్ పై పారిపోయేందుకు యత్నించడంతో దీన్ని గుర్తించిన యువతి బంధువులు వారిని వెంబడించారు. దీంతో బైక్ వదిలి పొలాల్లోకి పారిపోతున్న సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, చిట్టిబాబు, శివారజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అయితే, యువకులను పోలీసులు అరెస్టు చేశారు. బైక్‌పై పారిపోతన్న సమయంలో అతలాపురం గ్రామ సమీపంలో పడిపోయారు. గ్రామస్థులు వెంటాడుతుండడంతో భయపడి ముగ్గురు కూడా పొలాల్లోకి పారిపోయారు. రాత్రి కావడంతో ప్రమాదవశాత్తు పాడుపడిన బావిలో ముగ్గురూ పడ్డారు. ఈత రావడంతో యువకులు స్వల్ప గాయాలతో బయటకు వచ్చారు. యువతి మాత్రం మరణించింది.

బయటకు వచ్చిన యువకులిద్దరినీ అస్పత్రికి తరలించారు. అయితే, చీకటి కావడంతో యువతి కూడా బావిలో పడిపోయిన విషయం ఎవరూ గుర్తించలేదు. తమ అమ్మాయిని అపహరించడానికి ప్రయత్నించారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Girl dead, asLovers with their friend skipped into a well in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X