విజయవాడలో దారుణం ..కూతురు జోలికి రావద్దన్న తండ్రిని కూతురి ముందే నరికి చంపిన యువకుడు
కూతురు జోలికి రావద్దని మందలించిన తండ్రిని కన్న కుమార్తె ఎదురుగానే నడిరోడ్డుపై దారుణంగా నరికి హత్య చేశాడు ఓ యువకుడు. విజయవాడ లో జరిగిన ఈ దారుణం స్థానికులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. బృందావన్ కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే
నాలుగేళ్ళు యువతీయువకుల ప్రేమాయణం
భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్ బృందావన్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన కుమార్తె దార్శిని ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ అనే యువకుడు విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్స్టాలో దార్శినితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

తండ్రి హెచ్చరికతో ప్రియుడికి దూరంగా
ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను హెచ్చరించి మణికంఠను మరచిపోవాలని చెప్పారు. దీంతో దార్శిని అతడికి దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుందామని అతను చెప్పినా తిరస్కరించింది. తన కూతురు నో అన్నా వేధిస్తున్నాడని ఫీల్ అయిన శ్రీరామచంద్రప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. దీంతో మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి.
ప్రియురాలి తండ్రిపై ప్రియుడి దాడి
ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ శ్రీరామచంద్రప్రసాద్ వల్లే ఇదంతా జరిగిందని పట్టరాని కోపంతో అతడిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాపు నుండి రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ ఇంటికి వెళ్తున్న సమయంలో దాడి చేశాడు.
కూతురు ముందే తండ్రిపై కత్తితో దాడి చేసి హత్య
తండ్రీకూతుళ్లు స్కూటర్పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్పై కత్తితో దాడి చేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. దార్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు.
కేసు నమోదు
శ్రీరామచంద్రప్రసాద్ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications