జల్సాలు: ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు
విజయవాడ: ప్రియుడితో ప్రేమికుడితో కలిసి జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న యువతిని విజయవాడ సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చోరీ చేసి తెచ్చిన సొత్తును విక్రయించిన యువకుడిని కూడా అరెస్టు చేసి 4 లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
పాయకాపురం శాంతినగర్కు చెందిన దుర్గాభవాని డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేసింది. మూడేళ్ల కిందట ఇబ్రహీంపట్నానికి చెందిన నిరుద్యోగి కృష్ణంరాజు పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. కృష్ణంరాజు అవసరాల కోసం దుర్గాభవాని సిటీ బస్సుల్లో చోరీలు చేయడం ప్రారంభించింది.

వచ్చిన సొమ్ముతో ఇద్దరూ జల్సా చేసేవారు. గత రెండేళ్లుగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆమె పలుచోట్ల చోరీలకు పాల్పడింది. వీటిలో ఏడు కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా సిటీ బస్సుల్లో జరుగుతున్న చోరీలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా ఉంచారు.
మంగళవారం ఓ థియేటర్ వద్ద ఉండగా కృష్ణంరాజు అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. చోరీ సొత్తును విక్రయించేందుకు వచ్చిన ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో వారి దొంగతనం వ్యవహారం బయటపడింది.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications