వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా: జనసేనలోకి ఎంట్రీ ఖరారు!
అమరావతి: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరో కీలక నేత గుడ్బై చెప్పారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి వైయస్సార్సీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తితో ఉన్న బాలశౌరి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ కు మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీని వీడడానికి కారణంగా తెలుస్తోంది. కాగా, రానున్న రెండు రోజుల్లో బాలశౌరి.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ లేదా అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ బాలశౌరి ఆశిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే 'పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నాను' ఎంపీ బాలశౌరి ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. దీంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు వెల్కమ్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో అసంతృప్తితో ఉన్న రాజకీయ నాయకులు భారీ సంఖ్యలోనే పార్టీలు మారుతున్నారు. ఇది ఇలావుండగా, విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పార్టీనికి వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తన అభిమానులు, కార్యకర్తలతో భవ కుమార్ చర్చించారు. పార్టీ వీడొద్దంటూ తనపై వైఎస్సార్సీపీ అధిష్టానం నుంచీ తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. అయితే, భవ కుమార్ వీడేందుకు ఆయన సిద్ధమయినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. 2019 నుంచీ వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడుగా భవకుమార్ కొనసాగుతున్నారు. పార్టీ వీడొద్దంటూ ఆయన వద్దకు దేవినేని అవినాష్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, తెలుగుదేశం నేతలతోనూ సంప్రదింపుల్లో ఉన్నానని భవకుమార్ తెలిపారు. కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులతో మాట్లాడి త్వరలో తన నిర్ణయం చెబుతానని స్పష్టం చేశారు.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications