మచిలీపట్నం-NH-65.. గ్రీన్ ఫీల్డ్ హైవే.. కేంద్రం గుడ్ న్యూస్..
మచిలీపట్నం పోర్టును NH-65, NH-216 జంక్షన్ తో అనుసంధానించేలా, NH-216 మచిలీపట్నం బైపాస్ మీదుగా 6-లేన్ల ఎక్స్ టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ. 573.77 కోట్ల కేటాయింపులకు తాజాగా ఆమోద ముద్ర లభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద ఈ నిధుల విడుదలకు ఆమోదం లభించింది.
విజయవాడ- మచిలీపట్నం పోర్టు జాతీయ రహదారి-65 (NH65) ఆరు వరుసలుగా విస్తరణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఆరు లేన్లుగా మార్చేందుకు కేటాయించిన రూ. 573.77 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోస్టు చేశారు.
" మచిలీపట్నం పోర్టును NH-65, NH-216 జంక్షన్ తో అనుసంధానించేలా, NH-216 మచిలీపట్నం బైపాస్ మీదుగా 6-లేన్ల ఎక్స్ టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ. 573.77 కోట్ల కేటాయింపును ఆమోదించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మచిలీపట్నం పోర్టుకు, జాతీయ రహదారి కారిడార్ కు మధ్య నేరుగా అంతరాయం లేని రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీనివల్ల సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గి, లాజిస్టిక్స్ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 6-లేన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్లు, 3 ఫ్లైఓవర్లు మరియు ఒక ఓవర్పాస్-కమ్-రైల్వే ఓవర్బ్రిడ్జ్ (ROB) నిర్మించనున్నారు" అని నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
📢 Andhra Pradesh 🛣️
— Nitin Gadkari (@nitin_gadkari) February 5, 2026
In Andhra Pradesh, we have approved an allocation of ₹573.77 crore for the construction of a 6-lane external port connectivity road linking the junction of NH-65 and NH-216 to Machilipatnam Port, via the Machilipatnam bypass section of NH-216.
The project…
ఇక ఈ 6 లేన్ల రహదారి ద్వారా భారీ కంటైనర్ల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల వల్ల స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరుకు రవాణా సాగుతుంది. అలాగే ఈ అనుసంధానం ద్వారా మచిలీపట్నం ప్రాంతం ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.

మరోవైపు విజయవాడ బైపాస్ రోడ్డుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పారు. గొల్లపూడి నుంచి చినకాకాని వరకు నిర్మిస్తున్న ఆరు వరుసల రోడ్డు మార్చి 31 నాటికి పూర్తవుతుందన్నారు. రూ.1,194.59 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications