మహా శివరాత్రి నాడు ఆ చారిత్రాత్మక ఆలయంలో..
Maha Shivratri 2025: నేడు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు జామునాటి మొదటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరమశివుడిని దర్శించుకుంటోన్నారు.
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో వెలిసిన మహా కాళేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భస్మ హారతిని కళ్లారా వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటోన్నారు. సరిగ్గా తెల్లవారు జామున 3 గంటలకు తొలి పూజ ఆరంభమైంది.

పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భస్మ హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణ భక్తుడిలా అందరి మధ్యా కూర్చుని భజనలో పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు హన్స్రాజ్ రఘువంశీ సహా పలువురు ప్రముఖులు భస్మ హారతిని తిలకించిన వారిలో ఉన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తాకిడి నెలకొంది. పుణ్యక్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శైవ నామస్మరణతో మార్మోగుతున్నాయి. తెలంగాణలో కీసరగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, కాళేశ్వరం, ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, శ్రీముఖం..వంటి ఆలయాల్లో భక్తుల కోలాహలంగా నెలకొంది.
మహా శివరాత్రి సందర్భంగా తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామి అశ్వ వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా సాగింది.
వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
#WATCH | Madhya Pradesh: Minister of Civil Aviation Ram Mohan Naidu attended the morning Aarti at Ujjain's Shri Mahakaleshwar Jyotirlinga Temple pic.twitter.com/31FdVw4Q8U
— ANI (@ANI) February 25, 2025
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అటు ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. శ్రీశైలం సహా ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి భక్తులకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని వచ్చాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications