మైండ్లెస్: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్తో మహేష్ కత్తి గిల్లికజ్జా
Recommended Video
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో రాజీకి వచ్చిన సినీ క్రిటిక్ మహేష్ కత్తి తాను చేసిన బాసను మరిచిపోయినట్లున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులతో కత్తి మహేష్కు ఆ మధ్య జరిగిన సమరం ముగిసింది.
ఇరు వర్గాలు పార్టీ చేసుకుని రాజీకి వచ్చాయి. అయితే చాలా కాలం మహేష్ కత్తి పవన్ కల్యాణ్పై వ్యాఖ్యలేమీ చేయలేదు. ఇటీవల పవన్ రాజకీయాల గురించి మాట్లాడినప్పటికీ ఫ్యాన్ జోలికి వెళ్లలేదు.
మళ్లీ పవన్ కల్యాణ్పై ఇలా...
తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే మహేష్ కత్తి తిరిగి వార్ ప్రారంభించినట్లు కనిపిస్తున్నారు. శనివారం తాజాగా చేసిన ట్వీట్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తనను పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని ఇటీవల ట్వీట్ చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బలహీనతపై వ్యాఖ్యానించారు.
బలం ఏమిటో తెలియదు గానీ...
పవన్ కల్యాణ్ బలం ఏమిటో ఇంకా తెలియదు గాన బలహీనత మాత్రం నోళ్లు దుపులో లేని, మైండ్ లెస్ ఫ్యాన్స్ అని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ అభిమానులపై ఈ స్థాయిలో వ్యాఖ్య చేయడం రాజీకి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి. మళ్లీ ఇరు పక్షాల మధ్య వార్ ముదిరే సూచనలే కనిపిస్తున్నాయి.
దానికీ తూట్లు పొడుస్తూ...
తన మానాన తాను పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోం ఏవో ప్రణాళికలు చేసుకుంటూ రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటున్నారని, దానికి కూడా ఫ్యాన్స్ తూట్లు పొడుస్తూ వెళ్తున్నారని ఆయన అన్నారు.
అందుకు ఫ్యాన్స్ చాలు.
అటువంటి ఫ్యాన్స్ చాలు పవన్ కల్యాణ్ రాజకీయంగా భూస్థాపితం కావడానికి అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను, వేసిన అడుగులను మహేష్ కత్తి ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి.