వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూటు మార్చిన కత్తి మహేష్, ట్విట్టర్‌లో సంచలన ‘ప్రకటన’, ఈసారి ఏపీ ఎంపీలపై, ఏమన్నారంటే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: తన వ్యాఖ్యలతో ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌, ఆయన అభిమానులపై విరుచుకుపడే సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఈసారి రూటు మార్చాడు. తాజాగా ట్విట్టర్‌లో మరో దుమారానికి తెరలేపాడు.

ఈసారి కత్తి మహేష్ టార్గెట్ ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. అవును, గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటనలో.. ఏపీ ఎంపీలపై ఆయన విమర్శలు గుప్పించాడు. ''ప్రకటన: ఆంధ్రప్రదశ్ రాష్ట్రానికి చేవగల ఎంపీలు కావాలెను..'' అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.

 Mahesh Kathi Sensational Comments on Andhra Pradesh MPs

సహజంగానే నెటిజన్లు ఈ పోస్టుపై స్పందించారు. ఓ నెటిజన్ 'చేవ' అంటే ఏమిటని ప్రశ్నించగా... ''పార్లమెంట్‌లో గొంతు విప్పి రాష్ట్రం కోసం పోరాడటం చేతనవ్వాలి.. అదే చేవ..'' అని కత్తి మహేష్ సమాధానమిచ్చాడు.

దీంతో కొంతమంది నెటిజన్లు.. ''అదేదో మీరే స్వతంత్ర్య అభ్యర్థిగా నిలబడి ప్రయత్నించవచ్చు కదా?'' అని సూచించగా, మరికొందరేమో ఆయనపై విమర్శలు గుప్పించారు. మరి కత్తి మహేష్ తాజా కామెంట్స్‌పై ఏపీ ఎంపీలు ఎలా స్పందిస్తారో?

English summary
Cini Critique Kathi Mahesh again made sensational comments on his twitter account on Thursday. But this time his target is AP MPs.. not Pawan Kalyan or his fans. So we should wait and see how AP MPs will react on Kathi Mahesh's new comments on their abillity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X