'కావాలనే చేస్తున్నారు, వెంకయ్య పంచెలూడదీసి కొడతాం, బాబుకు బుద్ధి చెప్తాం'
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ, మాలల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు పంచెలూ ఊడదీసి తరిమికొడతామని మాల మహానాడు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల సుదర్శన్ హెచ్చరించారు.
నెల్లూరు: ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ, మాలల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు పంచెలూ ఊడదీసి తరిమికొడతామని మాల మహానాడు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల సుదర్శన్ హెచ్చరించారు.
ఆదివారం నెల్లూరులో జరిగిన మాల మహానాడు కమిటీ సమావేశంలో మాట్లాడారు. మాల, మాదిగల మధ్య కావాలనే వర్గీకరణ పేరుతో వెంకయ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాలలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు.

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఇచ్చే రుణాల మొత్తాన్ని టిడిపి నాయకులకే ఇస్తున్నారని విమర్శించారు.
మాలల ఓట్లతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడులకు బుద్ధి చెబుతామన్నారు. నెల్లూరులో జూలై 25న పెద్ద ఎత్తున మాలల సభ నిర్వహిస్తామన్నారు.
More From
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications