మూగ బాలిక బాలిక చెంప, చేతిపై కాల్చాడు(పొటో)
హైదరాబాద్: నగరంలోని దోమలగూడలో దారుణం జరిగింది. ముఖం కడుక్కోలేదని ఓ మూగ ఆరేళ్ల బాలిక చెంప, చేతులపైనా ఓ వ్యక్తి వేడిగా ఉన్న గరిటెతో కాల్చాడు. దోమలగూడలో నివసించే రమేష్ కూతురు పవిత(6) నారాయణగూడలోని దత్తానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. వీరుంటున్న ఇంటి పై అంతస్తులో విజయ్(27) ఉంటున్నాడు.
గురువారం ఉదయం పవిత్ర ముఖం కడుక్కోలేదని ఆగ్రహం చెందిన విజయ్ వేడిగా గరిటెతో ఆమె ముఖం, చేతిపై కాల్చాడు. పవిత్ర కాలిన గాయాలను చూపడంతో ఆమె తండ్రి రమేష్, ఆమె చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషన్ సభ్యుడు అచ్యుతరావు బాధిత బాలికను తీసుకుని చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడు విజయ్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విజయ్ వాతలు పెట్టడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.