చంద్రబాబు నివాసం వద్ద పురుగుమందు డబ్బాతో వ్యక్తి హల్చల్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసం వద్ద పురుగుమందు డబ్బాతో గంగుల శ్రీనివాస రెడ్డి అనే ఓ వ్యక్తి హల్చల్ చేసాడు.
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసం వద్ద పురుగుమందు డబ్బాతో గంగుల శ్రీనివాస రెడ్డి అనే ఓ వ్యక్తి హల్చల్ చేసాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తిగా కనుగొన్నారు. ఇతను పురుగుమందు త్రాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆందోళనకు దిగాడు.
కేశవ రెడ్డి స్కూల్స్ అధినేత కు 5 లక్షలు ఇచ్చానని అవి ఇప్పించాలని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడి నుండి రావలసిన డబ్బుల విషయం లో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, కనీస అవసరాలు కు చేతిలో డబ్బు లేదని కన్నీళ్ల పర్యంత మయ్యాడు.
అలాగే,తమ ఇద్దరు పిల్లలు గుండె జబ్బుతో బాధపడుతున్నారని వారికి వైద్యం చేయించేందుకు తన వద్ద చిల్లిగవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు వద్ద పోలీసులు పురుగుమందు డబ్బాను స్వాదీనం చేసుకున్నారు.బాధితుడి నచ్చజెప్పి సీఎం నివాసం లోపలికి పంపారు సెక్యూరిటీ సిబ్బంది.