భార్య షికారుకు రాలేదనే కోపంతో వ్యక్తి ఆత్మహత్య

వారిద్దరు కొంత కాలంగా దిల్షుక్నగర్లోని శారదానగర్లో కాపురం ఉంటున్నారు. వంశీకృష్ణ మెడికల్ రిప్రజెంటెటివ్గా పనిచేస్తున్నాడు. శనివారంనాడు హిమబిందు పుట్టిన రోజు కావడంతో ఇద్దరు కలిసి బయటకు వెళ్తామని భర్త ప్రతిపాదించాడు. ఇందుకు భార్య నికారించింది. దాంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.
భార్య మొండికేయడంతో మనస్తానికి గురైన వంశీకృష్ణ రాత్రి సమయంలో గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత భార్య తలుపు తట్టింది. తలుపులు తట్టినా ఫలితం లేకపోవడంతో ఆమె తన సోదరుడిని పిలిపించింది.
ఆమె సోదరుడు తలుపులు బద్దలు కొట్టి చూడగా వంశీకృష్ణ ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెంది ఉండడం కనిపించింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఆదివారంనాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications