భార్యాపిల్లల గొంతు కోసి, ఆత్మహత్యయత్నం చేశాడు

Man kills wife and children
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లల గొంతు కోశాడు. వారిని హత్య చేసిన తర్వాత తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా టిడి గుట్ట సమీపంలో జరిగింది. అతని భార్య, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. అతను గూర్కాగా పనిచేస్తున్నాడు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబ కలహాల కారణంగానే అతనీ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. అయితే, వివిధ కోణాల నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే గుంటూరు జిల్లా వల్లూరివారి తోటలో ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అత్యాచార యత్నాన్ని ఆమె తండ్రి అడ్డుకోబోయాడు. దాంతో వారు అతనిపై దాడి చేశారు.

ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+