హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఫైర్ అనుమానం: పబ్లిక్‌లో భార్య హత్య (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కాచిగుడాలో ఓ వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా తన భార్యను ఆదివారంనాడు హత్య చేశాడు. మృతురాలు జమునారాణి (43) బస్సు కండక్టర్‌గా పనిచేస్తోంది.

వివాదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. మాజీ పోలీసు అయిన వెంకటేశ్వర రావు నాయక్ (44) పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమె ఇంటికి రావడానికి అంగీకరించలేదు. తీవ్రమైన ఆగ్రహానికి గురైన అతను కత్తితో ఆమెపై దాడి చేశాడు.

Man kills wife in public in Hyderabad

ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయంది. జమున 2000లో వెంకటేశ్వర రావును పెళ్లి చేసుతుంది. వారిద్దరికి కూడా ఇది రెండో వివాహం. మొదటి భర్తతో ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

డిస్మిస్ అయిన వెంకటేశ్వర రావు తన భార్య జమునకు వైవాహికేతర సంబంధం ఉందని అనుమానిస్తూ వచ్చాడని పోలీసులు చెప్పారు. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వెంకటేశ్వర రావు ఆదివారంనాడు కాచిగూడా బస్టాండ్‌కు వచ్చాడు.

వెంకటేశ్వర రావు జమునకు ఉందని భావిస్తున్న వైవాహికేతర సంబంధం గురించి ప్రశ్నించాడు. ఆమె ఆ విషయాన్ని కొట్టిపారేసింది. వెంకటేశ్వర రావు అగ్రహంతో ఆమెను కత్తితో పొడిచాడు. అది చూసినవారు పోలీసులను అప్రమత్తం చేశారు.

English summary
A woman was killed by her husband in broad daylight in Kacheguda on Sunday. The victim Jamuna Rani, 43, an APSRTC bus conductor was living away from her husband due to disputes. Even after requests from her husband Venkateshwar Naik, 44, an ex-cop, she didn’t return.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X