మరో హత్య:భర్తను ప్రియుడి చేత భార్యే చంపించింది...ఎంత దారుణం అంటే!
తూర్పుగోదావరి:అమాయకుడైన భర్తను తమ రాసలీలలకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలసి చంపేయడమో, చంపించడమో చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా నమోదవుతున్నాయి.
తాజాగా ఇటువంటిదే మరో దారుణం తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడికి, తనకు మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని ఆ భార్య...అదే ఆలోచనతో ఉన్న ఆమె ప్రియుడు ఒక పథకం ప్రకారం అతడిని దారుణంగా హతమార్చారు. చంపే క్రమంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న భర్తను సజీవంగానే పూడ్చి పెట్టారనే అనుమానం కూడా ఉంది. అంతేకాదు ఆ తరువాత వారు ఆడిన డ్రామాలు పోలీసులను సైతం విస్మయపరిచాయి. వివరాల్లోకి వెళితే...

ఎంత నాటకం...ఎంత దారుణం
నా భర్త ఏడీ?..నా భర్తను తీసుకొచ్చి నా పక్కన కూర్చోపెట్టండి...అట్లాఅయితేనే నేను అన్నం తింటా?...ఎక్కడున్నాడో తీసుకురండి...అంటూ ఆమె...నా ఫ్రెండ్...నా అన్న...ఏమైపోయాడు నాకు ఒక్కమాటైనా చెప్పకుండా వెళ్లడు...నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అంటూ అతడు...ఇలా పది రోజుల పాటు ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు...కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు...అలా పోలీసులను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి వాళ్లను పరుగులు పెట్టిస్తూ ముచ్చెమటలు పట్టించేవాళ్లు.

అసలు...ఏం జరిగిందంటే?
కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన మచ్చా సత్తిబాబుకు ఏడాది కిందట పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతితో పెళ్లయింది. జ్యోతి పదో తరగతి చదువుతుండగానే ఆమె తల్లిదండ్రులు ఆమెను సత్తిబాబుకిచ్చి వివాహం చేశారు. అయితే అప్పటికే ఆమెకు దివిలి గ్రామానికి చెందిన చిక్కడాల రాజాతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. కూలిపని చేసుకునే సత్తిబాబు జ్యోతికి మొరటుగా అనిపించి భర్తంటే ఇష్టం ఉండేది కాదు. ఆ క్రమంలో ఈమె ఐటిఐ చదువుతున్న తన ప్రియుడు రాజాతో వెళ్లిపోవాలని...వీరిద్దరూ లేచిపోవాలని పలు మార్లు అనుకున్నారని పోలీసుల విచారణలో తెలిసింది.

అయితే...ప్లాన్ మారింది
అయితే అలా లేచి వెళ్లిపోతే లేనిపోని సమస్యలు...పైగా మూడు కుటుంబాలకు అవమానం...దాని వల్ల ఇబ్బందులు...ఇవన్నీ దేనికని...అసలు తమ సమస్యకు మూలమైన...తమ రాసలీలలకు అడ్డుగా ఉన్న భర్తను అడ్డుతప్పిస్తే పోలా అనుకున్నారు. అందుకు చాలా పెద్ద ప్లానే వేశారు. ఈక్రమంలో ఆమెపై భర్తకు అనుమానం రాకుండా ప్రియుడే భర్తను ముందు స్నేహితునిగా చేసుకునేలా...ఆ తరువాత అనుమానం రాకుండా అంతమొందించేలా వెనకుండి కథను నడిపించింది. అదెలాగంటే...ఈమె ప్రియుడు రాజా ఆమె భర్తకు ముందుగా ఏదో మిషతో ముఖపరిచయం అయ్యాడు...ఆ తరువాత మెల్లిగా ఇంటికి రావడం మొదలుపెట్టి
తరుచూ వచ్చేవాడు. మరోవైపు జ్యోతి పలుమార్లు భర్తతో కలసి ప్రియుడు ఇంటికి వచ్చినా అతనెవరో అస్సలు తెలియనట్లే నటించేది. అలా కొంతకాలం స్నేహం సాగించిన రాజా సత్తిబాబుకు తరుచూ బాగా మద్యం తాగించేవాడు.

ఆ తరువాత హత్య...ఇలా
ఆ క్రమంలో గత నెల 19వ తేదీన రాత్రి ముక్కొల్లు గ్రామంలో ఇంటినుంచి బయలు దేరిన సత్తిబాబు తనస్నేహితుడిని కలిసేందుకు దివిలి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయలుదేరాడు. ఆ విషయాన్ని ఆమె ప్రియుడు రాజాకు ఫోన్ద్వారా సమాచారం అందించింది. ఈ మేరకు సత్తిబాబును చంద్రమాంపల్లిలో కలిసిన రాజా దివిలిలోని మద్యం దుకాణం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాగా తాగించి జి.రాగంపేట, దివిలి గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులతో కలిసి ఇనుపరాడ్డుతో సత్తిబాబు తలపై బలంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మోటారు సైకిల్పై చంద్రమాంపల్లి తీసుకొచ్చి అప్పటికే సిద్ధంచేసుకుని ఉంచిన పాఠశాల వెనక గోడను ఆనుకుని తీసిన గోతిలో పూడ్చిపెట్టారు. అయితే అప్పుడు సత్తిబాబు ఇంకా సజీవంగానే ఉన్నాడని, కోమాలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

సత్తిబాబు అదృశ్యం...డ్రామాలు...అరెస్ట్
అలా మచ్చా సత్తిబాబు ఈ ఏడాది జూన్ 19వ తేదీన అదృశ్యమయ్యారు. 22వ తేదీ వరకు ఆయన ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించారు. కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కిర్లంపూడి పోలీస్స్టేషన్లో జూన్ 26వ తేదీన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అదిగో...ఇక అప్పటినుంచే పైన వర్ణించిన తీరులో ఇటు భార్య...అటు ఆమె ప్రియుడు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేశారు...అయితే వీళ్ల ఓవర్ యాక్షనో...లేక ఏదైనా సమాచారం తెలిసిందో కాని...ఎట్టకేలకు పోలీసులకు వీరిపై అనుమానం వచ్చింది. దీంతో వీరిని గట్టిగా తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన దారుణం బైటకు వచ్చింది. సోమవారం నాడు చంద్రమాంపల్లి పాఠశాలకు సెలవు ప్రకటించి మృతదేహాన్ని వెలికితీశారు. హత్యకు ఉపయోగించిన రాడ్, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.నిందితులను అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications