నీతూపై దాడికి యత్నం, సబ్ జైల్లోని లావాదేవీలవల్లే!
కర్నూలు: ఎర్రచందనం కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి నీతూ అగర్వాల్ పైన నాగరాజు అనే వ్యక్తి దాడికి యత్నించాడు. ఎర్ర చందనం కేసులో బెయిల్ పై విడుదలైన నీతూ అగర్వాల్ కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చారు.
తిరిగి హైదరాబాద్ వెళుతుండగా నంద్యాల శివారులోని అయ్యలూరు మెట్ట సమీపంలో నాగరాజు అనే వ్యక్తి నీతూ అగర్వాల్పై దాడికి ప్రయత్నించాడు. నీతూ సబ్ జైలులో ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇటీవల బెయిల్ పైన విడుదలైన నీతూ అగర్వాల్కు కోర్టు షరతులు విధించారు. ప్రతి ఆదివారం రుద్రవరం పోలీసు స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసు స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా దాడికి యత్నించారు.
నీతూ అగర్వాల్ సబ్ జైలులో ఉన్నప్పుడు ఆమె బట్టలను కూడా నాగరాజు ఉతికేవాడని తెలుస్తోంది. గతంలో ఆర్టీసీ డ్రైవర్గా ఉన్న నాగరాజు ఎర్ర చందనం స్మగ్లర్కు సహకరిస్తూ.. తమిళనాడు నుండి కూలీలను బస్సులో తీసుకు వచ్చేవాడు. ఈ క్రమంలో నాగరాజును సస్పెండ్ చేశారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications