నీతూపై దాడికి యత్నం, సబ్ జైల్లోని లావాదేవీలవల్లే!
కర్నూలు: ఎర్రచందనం కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి నీతూ అగర్వాల్ పైన నాగరాజు అనే వ్యక్తి దాడికి యత్నించాడు. ఎర్ర చందనం కేసులో బెయిల్ పై విడుదలైన నీతూ అగర్వాల్ కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చారు.
తిరిగి హైదరాబాద్ వెళుతుండగా నంద్యాల శివారులోని అయ్యలూరు మెట్ట సమీపంలో నాగరాజు అనే వ్యక్తి నీతూ అగర్వాల్పై దాడికి ప్రయత్నించాడు. నీతూ సబ్ జైలులో ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇటీవల బెయిల్ పైన విడుదలైన నీతూ అగర్వాల్కు కోర్టు షరతులు విధించారు. ప్రతి ఆదివారం రుద్రవరం పోలీసు స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసు స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా దాడికి యత్నించారు.
నీతూ అగర్వాల్ సబ్ జైలులో ఉన్నప్పుడు ఆమె బట్టలను కూడా నాగరాజు ఉతికేవాడని తెలుస్తోంది. గతంలో ఆర్టీసీ డ్రైవర్గా ఉన్న నాగరాజు ఎర్ర చందనం స్మగ్లర్కు సహకరిస్తూ.. తమిళనాడు నుండి కూలీలను బస్సులో తీసుకు వచ్చేవాడు. ఈ క్రమంలో నాగరాజును సస్పెండ్ చేశారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications