మావో బంద్: ఏవోబీలో టెన్షన్, టి, ఏపీల్లో హై అలర్ట్, విస్తృత తనిఖీలు
విశాఖపట్నం: మావోయిస్టులు గురువారం(నవంబర్ 3న) బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయనగరం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులను పూర్తిగా నిలిపివేశారు. వ్యాపార, విద్యా సంస్థలు కూడా మూసివేశారు. కాగా, మావో ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు.. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
ఏవోబీ ఎన్కౌంటర్కు నిరసనగా నవంబర్ 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడవచ్చనే అనుమానంతో ఈ ఐదు రాష్ట్రాల్లోని పోలీసులూ అప్రమత్తమయ్యారు.

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ పోలీసులు.. మావో ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మోహరించి విస్తృత తనఖీలు చేపడుతున్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రత పెంచారు. సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవద్దని సూచించారు.
తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం- ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోనూ హైఅలర్డ్ ప్రకటించారు. భారీగా మోహరించిన పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా బంద్ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications