ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీలు, నియాకాలను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీదత్‌ను నియమించింది. ఆయనకు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి, హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ నియమితులయ్యారు.

నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఎండీగాను హరికిరణ్‌కు అదనపు బాధ్యతలు, సెర్ప్‌ సీఈవోగా వీరపాండ్యన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌గా ఎం.హరినారాయణ, బీసీ సంక్షేమ డైరెక్టర్‌గా మల్లికార్జున, బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా మల్లికార్జునకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Massive transfers and appointments of IAS in AP

సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్‌, భూ సర్వే, సెటిల్‌మెంట్‌ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీగా గిరిశ్ షా, ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్‌ జిలానీ, మంజీర్‌ జిలానీకి శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలు, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లా, బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గాను కృతికా శుక్లాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఎస్పీపీడీసీఎల్‌ సీఎండీగా రవి సుభాష్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా లక్ష్మీ షా, ఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈవోగాను లక్ష్మీ షాకు అదనపు బాధ్యతలు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్‌గా ఎం.వేణుగోపాల్‌రెడ్డి, అల్లూరి జిల్లా జేసీగా అభిషేక్‌ గౌడ, మదనపల్లి సబ్‌ కలెక్టర్‌గా మేఘస్వరూప్‌, రాజంపేట సబ్‌కలెక్టర్‌గా వైకోమ్‌ నైదియాదేవి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా కృష్ణ తేజ నియమితులయ్యారు.

ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా ఉన్న చక్రధర్‌బాబు బదిలీ అయ్యారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఐజీ రామకృష్ణకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. కాకినాడ జేసీగా గోవిందరావు, కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎన్‌.తేజ్‌ భరత్‌, కె.ఆర్‌.పురం ఐటీడీఏ పీవోగా డి.హరిత, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్లుగా సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, నవీన్‌, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా భావన, నంద్యాల జేసీగా సి.విష్ణు చరణ్‌ నియమితులయ్యారు.

ఎన్టీఆర్‌ జిల్లా జేసీగా నిధి మీనా, రంపచోడవరం ఐటీడీఏ పీవోగా కట్టా సింహాచలం, తిరుపతి జిల్లా జేసీగా శుభం భన్సల్‌, నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా మల్లవరపు సూర్యతేజ, సీతంపేట ఐటీడీఏ పీవోగా తాటిమాకుల రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా నూరుల్‌ కమర్‌, శ్రీకాకుళం జేసీగా ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, కడప జేసీగా అదితి సింగ్‌ నియమితులయ్యారు.

పార్వతీపురం ఐటీడీఏ పీవోగా మాధవన్‌, ఏలూరు జేసీగా పి.ధాత్రిరెడ్డి, అన్నమయ్య జిల్లా జేసీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌, గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా నవ్య, గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌గా దినేష్‌కుమార్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా ధ్యానచంద్ర, ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ సీఈవోగా ప్రవీణ్ ఆదిత్య, ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ ఆదిత్యకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

కోనసీమ జిల్లా జేసీగా నిశాంతి, తూ.గో జేసీగా హిమాన్షు కౌశిక్‌, గుంటూరు జేసీగా అమిలినేని భార్గవ తేజ, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా నారపురెడ్డి మౌర్య, సీసీఎల్‌ఏ కార్యాలయం జాయింట్‌ సెక్రటరీగా శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌కుమార్‌, పల్నాడు జేసీగా సూరజ్‌ ధనుంజయ్‌, గిరిజిన కో-ఆపరేటివ్‌ ఎండీగా కల్పన కుమారి, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా కేతన్‌ గార్గ్‌ నియమితులయ్యారు.

ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పి.రాజబాబు, ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌, క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీగా జి.సి. కిషోర్‌కుమార్‌, అగ్రికల్చర్‌ మార్కెట్‌ శాఖ డైరెక్టర్‌గా విజయసునీత, ఉద్యానశాఖ డైరెక్టర్‌గా కె.శ్రీనివాసులు, సాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా లావణ్య వేణి, ఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్‌ కిషోర్‌, ఏపీటీడీసీ ఎండీగానూ అభిషిక్త్‌ కిషోర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌గా ఏ.సిరి, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి, కాడా కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ ఎండీగా కీర్తి చేకూరి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా గణేష్‌కుమార్‌ ,విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌గా సంపత్‌కుమార్ నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+