వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారం జగన్ పాదయాత్రకు విరామం...పార్టీ ఎంపీలతో సమావేశం

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైసిపి అధినేత జగన్ మోహన్‌రెడ్డితో సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఎంపీలు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని ముప్పాళ్ళలో ఈ భేటీ జరగనున్నట్లు తెలిసింది.

తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తో జరిగే ఈ కీలక సమావేశానికి వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు హాజరవుతారని ఆ పార్టీ గుంటూరు జిల్లా నేతలు తెలిపారు. ఈ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీలు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. వైసిపి ముందుగానే ప్రకటించినట్లుగా ఏప్రిల్‌ ఆరో తేదీన వైసీపీ ఎంపీలతో రాజీనామా చేసే అంశంపై కీలక నిర్ణయం ఈ భేటీలోనే తీసుకునే అవకాశం ఉంది.

Meeting of YCP MPs with Jagan on Monday

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నజగన్‌ 120 వ రోజు పాదయాత్ర ఆదివారం నరసరావుపేట మండలం నుంచి ప్రారంభమై సత్తెనపల్లి నియోజకవర్గంలోని గోళ్ళపాడు మీదుగా ముప్పాళ్ళకు చేరుకుంది. మరోవైపు జగన్‌ పాదయాత్రకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సోమవారం విరామం ఇచ్చారు

English summary
Guntur:During the Sriramanavami festival, YCP announced a break for the Jagan padayatra. On the other hand, Jagan will hold a key meeting with his party MP's on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X