గుంటూరు జిల్లాలో తెగబడిన కామాంధులు: బాలికపై అత్యాచారం
గుంటూరు: మానసిక వికలాంగురాలైన బాలికపై ఓ నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని చిలువూరులో చోటుచేసుకుంది. చిలువూరు గ్రామానికి చెందిన బాలిక ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి బహిర్భూమికి వెళ్లింది.
ఆమె రాకను గమనించిన అదే గ్రామానికి చెందిన ఎగ్గిడి ఆంజనేయులు తాను కౌలుచేస్త్తున్న నిమ్మతోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన కూతురు తిరిగి రాకపోవడంతో ఏం జరిగిందో, అనుకుంటూ ఆమె తల్లి గాలింపు చేపట్టింది.
తోటలో కంటపడిన దారుణమైన దృశ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఎస్ఐ ఎం. మురళి కేసు నమోదు చేసి, బాలికను వైద్యపరీక్ష నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు తెలిపారు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
బాలికపై అత్యాచార యత్నం
బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన పట్టణంలోని సుగాలికాలనీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం బాలిక తల్లిదండ్రులు పట్టణ పోలీస్స్టేషనలో ఫిర్యాదుచేశారు. అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు యల్లమందను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.