సైకిల్ యాత్రలో అపశ్రుతి: టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు గుండెపోటు!
ఏలూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సైకిల్ యాత్రల్లో వరుసగా అపశ్రుతులు దొర్లుతూ వస్తున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చింతల పూడిలో సైకిల్ యాత్రలో పాల్గొన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు సొమ్మసిల్లి పడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయన్ను ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. మాగంటి బాబుకు ప్రాథమికి చికిత్స అందించామని, స్వల్ప గుండెపోటుకు గురవడం వల్లే సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. కాసేపట్లో ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాగా, టీడీపీ సైకిల్ యాత్రలో ఇటీవలే స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా స్వల్పంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ స్పీకర్ కిందపడిపోవడంతో ఆయనకు తలకు గాయాలయ్యాయి. అయినా సరే, స్పీకర్ వాటిని లెక్కచేయకుండా సైకిల్ యాత్రను కొనసాగించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications