విజయవాడలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం: యాదవ నేతల సంబరం
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చిత్రపటానికి విజయవాడలో పాలాభిషేకం చేశారు. యాదవ కులస్తులకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో యాదవ యువభేరి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యాదవ నేతకు రాజ్యసభ సీటును ప్రకటించేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు పాలాభిషేకాలు చేస్తూనే ఉంటామని నేతలు స్పష్టం చేశారు.

రాజ్యసభకు యాదవ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అమరావతి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదాన్ని కేసీఆర్కు అందజేస్తామని తెలిపారు.
యాదవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గొల్లకుర్మల సంక్షేమ భవన సముదాయానికి శంకుస్థాపన చేయడం అద్భుతమని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి అభినందనీయమని యాదవ సంఘం నేతలు పేర్కొన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications