దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి: పెట్టుబడులే లక్ష్యంగా కంపెనీలతో చర్చలు..
సాంకేతికతలో దూసుకుపోతున్న దక్షిణకొరియాతో వాణిజ్య సంబంధాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఏపీ మంత్రి అమరనాథ్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు.
సియోల్: సాంకేతికతలో దూసుకుపోతున్న దక్షిణకొరియాతో వాణిజ్య సంబంధాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఏపీ మంత్రి అమరనాథ్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు.
పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా కియా మోటర్స్, హుండాయ్ మోబిస్ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. అలాగే ఎస్ఎల్ గ్రూప్, సుంగ్ వూ కంపెనీ ప్రతినిధులతోనూ అమర్నాథ్ రెడ్డి సమావేశం అవనున్నారు.

అమర్నాథ్ రెడ్డితో పాటు ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు, అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్ కూడా ఆయన వెంట వెళ్లారు. ప్రస్తుతం కియో మోటార్స్ తో చర్చలు జరుపుతున్న అమరనాథ్ రెడ్డి.. అనంతపురం జిల్లాలో ఆ కంపెనీతో పెట్టుబడులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏపీలో కంపెనీలను నెలకొల్పితే ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి వారికి వివరిస్తున్నారు. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ ప్రతినిధులతోను ఆయన చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications