Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏం పోయేకాలం వచ్చిందో గానీ..

బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇవ్వాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన సమక్షంలో కండువా కప్పుకొన్నారు. ఆయన చేరికను మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఇవ్వాళ తెలుగుదేశంలో చేరారు. తన అనుచరులతో ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకే టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు.

ఘాటుగా స్పందించిన అంబటి..

ఘాటుగా స్పందించిన అంబటి..

కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. కన్నాను ఏ మాత్రం నైతిక విలువలు లేని వ్యక్తిగా అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారని గుర్తు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ఆయన అలవాటని ఎద్దేవా చేశారు.

బీజేపీలో ఎలా చేర్చుకున్నారు..

బీజేపీలో ఎలా చేర్చుకున్నారు..

బీజేపీకి ఏం పోయేకాలం వచ్చిందో గానీ ఇన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ లో పని చేసిన కన్నా లక్ష్మీనారాయణకు కండువా వేసి మరీ ఆహ్వానించిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే గానీ, సుదీర్ఘకాలం సాధారణ కార్యకర్త స్థాయిలో పని చేసి ఉంటేనే పదవులు ఇస్తామని చెప్పుకొనే బీజేపీ అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణలో ఏం చూసి ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టిందని ప్రశ్నించారు.

అక్కడా తిన్నింటి వాసాలే..

అక్కడా తిన్నింటి వాసాలే..

బీజేపీలో చేరిన తరువాత కూడా కన్నా లక్ష్మీనారాయణ తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం మానలేదని, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగియగానే పక్క చూపులు చూడటం మొదలు పెట్టాడని అంబటి రాంబాబు విమర్శించారు. జనసేనలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని, అక్కడ బేరాలు కుదరకపోవడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడని ఆరోపించారు.

 బేరం కుదిరింది..

బేరం కుదిరింది..

చంద్రబాబుతో ఏ బేరం కుదుర్చుకున్నాడోనని, అందుకే కన్నా లక్ష్మీనారాయణ చివరికి తెలుగుదేశంలో చేరాడని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నైతిక విలువలను సర్వం కోల్పోయిన రాజకీయ నాయకుడు ఆయనొక్కడేనని అన్నారు. పదవుల కోసం ఏ రాజకీయ పార్టీలోనైనా చేరగల సమర్థుడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు మంత్రి పదవులను అనుభవించడాని, బీజేపీలో రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారని చెప్పారు. పదవి కోసమే టీడీపీలో చేరారని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+