రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త - 24 గంటల్లో నిధుల జమ..!!
ఏపీ ప్రభుత్వం రైతులకు బిగ్ అప్డేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పథకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అన్నదాత సుఖీభవ నిధులను ఇప్పటి వరకు రెండు విడతలు చెల్లించింది. పీఎం కిసాన్ తో కలిపి ఈ నిధులను విడుదల చేసింది. కాగా, ఇప్పుడు రైతులకు చేస్తున్న చెల్లింపు గురించి మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేసారు. ఎవరూ ఊహించని విధంగా 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేసారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఓ చరిత్రగా పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు జరగలేదని వివరించారు. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఈ ఖరీఫ్లో 9 వేల 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోపే జమ చేశామని చెప్పారు. ఇది ఎవరు ఊహించిన విధంగా చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. అదే విధంగా రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని వివరించారు. రైతుకు నమ్మకాన్ని కలిగించామని చెప్పారు.

రైతులు ధైర్యంగా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోగలం అనే నమ్మకాన్ని కూటమి ప్రభుత్వంలో కల్పించామని మనోహర్ చెప్పారు. రైసు మిల్లర్లు తప్పులు చేస్తే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఆరు నెలల్లోకా రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు వదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ హాయంలో చేసిన బకాయిలు 16 వందల 74 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం వచ్చాక రైతాంగానికి బకాయిలు తీర్చిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని చెబుతున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ నేర్చుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతాంగం సంక్రాంతి, ఉగాది కూడా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications