అమరావతి కేంద్రంగా ఢిల్లీ కీలక నిర్ణయం, నెక్స్ట్ ఇక..!!
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కొద్దిరోజుల కిందటే కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది. ఎంతో కాలంగా అమరావతి రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వం తాజాగా ఆమోదించిన రెండో విడత లాండ్ పూలింగ్ మొదలైంది. ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం కీలక హామీలు ఇస్తోంది.
అమరావతికి కేంద్రం అధికారికంగా రాజముద్ర వేసేందుకు రంగం సిద్దం అవుతోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత, త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం (గెజిట్) విడుదల చేస్తారు. ఇక.. ఇటు అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈరోజు (గురువారం) ప్రారంభమైంది. ఇందులో భాగంగా అమరావతి మండలం యండ్రాయిలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. రెండో విడతలో అమరావతి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు భూమిని సేకరించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని అన్నారు. రెండో విడతలో రైతులు ఇచ్చే 7000 పైగా ఎకరాల భూముల్లో 2500 ఎకరాలలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. గతంలో భూ సమీకరణ సమయంలో రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. ట్రంకు రోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు. నాలుగు, ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని.. ఇక్కడ కూడా ఏడాది కాలంలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications