వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల్లో పవన్ కళ్యాణ్ విశ్వాసం కోల్పోయారు: మంత్రి నారాయణ ప్రశ్నల వర్షం

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు గందరగోళం సృష్టిస్తున్నాయని మంత్రి నారాయణ మంగళవారం అన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే పవన్ విజయవాడలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

కేంద్రం ఎలా మోసగించిందంటే: వివరాలతో సహా మోడీకి కేశినేని నాని షాక్, ఎంపీలకూకేంద్రం ఎలా మోసగించిందంటే: వివరాలతో సహా మోడీకి కేశినేని నాని షాక్, ఎంపీలకూ

అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని, ఈ విషయం పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. పవన్‌ రోజుకో రకంగా మాట్లాడుతున్నారని, హోదా ఇస్తామని తిరుపతిలో మోడీ చెప్పలేదా అని నిలదీశారు.

Minister Narayana questions on Pawan Kalyan

ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని మోడీ అనలేదా అన్నారు.
ఇవన్నీ పవన్‌‌కు తెలియవా అని ప్రశ్నల వర్షం గుప్పించారు. ఎవరో చెప్పారని, కలలో వచ్చిందని పవన్‌ మాట్లాడటం సరికాదన్నారు.

పోలవరంపై పవన్‌ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అతను ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని, లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గట్టెక్కిస్తున్నారన్నారు.

అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. కేవలం పరిపాలనా నగరానికి మాత్రమే నిధులు కోరుతున్నామన్నారు. అంచనాల ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ను నోటిఫై చేసి ప్రజల సలహాలు తీసుకున్నామని చెప్పారు.

English summary
Andhra Pradesh Minister Narayana serial questions on Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X