తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్.. అకౌంట్లలో రూ.15 వేలు
ఏపీలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలకు వరుస శుభవార్తలను అందిస్తోంది. ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీల అమలుకు శ్రీకారం చూట్టింది. ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్లు పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం జరిగింది.ఇప్పటికే బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు.
దీని తర్వాత ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందించబోతున్నామని ప్రకటించినప్పటికి , దానిపై విధివిధానాలు పూర్తి కాకపోవడంతో ఈ హామీ అమలు వాయిదా వేయడం జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చూట్టబోతోంది. మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే పథాకాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనికి కావాల్సిన అర్హతలు త్వరలోనే విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది.

ఆ హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. సెప్టెంబర్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తల్లికి వందనం పథకం అమలుపై కూడా మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో స్కూల్ కు వెళ్తున్న ప్రతి విద్యార్థినికి రూ.15 వేలు త్వరలోనే వారి అకౌంట్లలో జమ చేస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన నిమ్మల.. అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications