Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ చెప్పారంటే చేస్తారంతే ... ఏపీ సీఎం కు మంత్రి పేర్ని నానీ, ఎంపీ విజయసాయిరెడ్డి కితాబు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కితాబిచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా జగన్ దార్శినికతపై ప్రశంసల జల్లు కురిపించారు . జగన్ రాష్ట్రంలో సంచలన నిర్ణయాలు తీసుకుని పేదల కష్టాలు తీరుస్తున్నారని పేర్కొన్నారు . ప్రజాసమస్యలు తీర్చడం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టి వాటి అమలు బాటలో ముందుకు సాగుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలు చూశారని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

 నిరుపేదల కల నిజం చేస్తారు : పేర్ని నానీ

నిరుపేదల కల నిజం చేస్తారు : పేర్ని నానీ

ఇప్పటికే దశల వారీగా మద్యం షాపులను తగ్గించారని, రాబోయే కాలంలో పూర్తిగా వచ్చే షాపులను నిర్మూలన చేస్తారని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మద్యానికి బానిసలైన కుటుంబాల పిల్లలు కార్మికులుగా పని చేస్తున్నారని, చిన్నారుల బాల్యం బుగ్గి పాలు కాకుండా, దానిని అధిగమించడం కోసమే అమ్మ ఒడి పథకాన్ని అందిస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్నారంటూ నాని కితాబిచ్చారు.

జగన్ చెప్పారంటే .. చేస్తారంతే : నానీ పొగడ్త

జగన్ చెప్పారంటే .. చేస్తారంతే : నానీ పొగడ్త

సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తారంతే అంటూ పేర్ని నాని జగన్ మాట తప్పని నేత అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల లో 95 శాతం అమలు చేశారని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు . రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక పండుగలాగా కొనసాగుతుందని పేర్కొన్న పేర్ని నాని, ఇల్లులేని వారు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇల్లు కట్టించి ఇస్తామంటూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం అంటే మామూలు విషయం కాదని, అది సీఎం జగన్ మోహన్ రెడ్డి చూపించారని పేర్ని నాని పేర్కొన్నారు.

జగన్ దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది: విజయసాయి

జగన్ దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది: విజయసాయి

వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సీఎం జగన్ కు కితాబిచ్చారు ఆంధ్రప్రదేశ్లో పక్కా గృహాల నిర్మాణం పూర్తయితే ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు . ఇళ్ల పట్టాల పంపిణీ తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది అన్నారు . శాశ్వత చిరునామా అంటూ లేని 30 లక్షల కుటుంబాలకు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా స్థలాలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+