తమిళనాడు బోర్డర్లో సినీ ఫక్కీలో దోపిడీ- లారీ ఆపి రూ.7 కోట్ల విలువైన సెల్ఫోన్ల చోరీ..
ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో సినీ ఫక్కీలో ఓ దోపిడీ జరిగింది. ఇందులో అచ్చుగుద్దినట్లు సినిమా తరహాలోనే ఆగంతకులు సెల్ఫోన్ల స్టాక్తో వెళ్తున్నలారీని ఆపి రూ. 7 కోట్ల విలువైన స్టాక్ను ఎత్తుకెళ్లారు. నగరి సమీపంలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. లారీలో పూర్తి స్టాక్ను కాకుండా తమకు కావాల్సిన విలువైన సెల్ఫోన్లను మాత్రమే ఆగకుంతులు దోచుకెళ్లడం సంచలనంగా మారింది.
తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి ముంబైలోని ఎంఐ ఫోన్ల గౌడౌన్కు సెల్ఫోన్ల లారీ వెళుతోంది. ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోకి లారీ రాగానే మరో లారీని అడ్డుపెట్టి ఆగంతకులు అడ్డగించారు. అడ్డొచ్చిన డ్రైవర్, క్లీనర్ను కట్టిపడేశారు. అనంతరం లారీని తీసుకెళ్లి నగరి సమీపంలోని జాతీయ రహదారిపై వదిలి వెళ్లిపోయారు.

ఈ లారీలో 16 పెట్టెల్లో రూ.12 కోట్ల విలువైన 15 వేల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో 8 పెట్టెలను మాత్రమే మరో 8 పెట్టెలు వదిలి వెళ్లిపోయారు. దోచుకెళ్లిన సెల్ఫోన్ల విలువ రూ.7 కోట్ల వరకూ ఉండొచ్చి పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 7500 మొబైల్ ఫోన్లు అపహరణకు గురై ఉండొచ్చని తెలుస్తోంది.
తమిళనాడులో ఉండగానే లారీని ఆగంతకులు అనుసరించి ఉంటారని, సరిహద్దుల్లోకి రాగానే నిర్మానుష్య ప్రాంతంలో వారు లారీని వ్యూహాత్మకంగా అడ్డగించి డ్రైవర్, క్లీనర్ను కట్టిపడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా కేసు వివరాలను శ్రీపెరంబదూరులోని ఎంఐ కార్యాలయానికి తెలియజేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications