వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మరో షాక్: బాబు సమక్షంలో టిడిపిలో చేరిన ఎమ్మెల్యే పోతుల(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే సుమారు 18మంది ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన అనుచరులతో కలిసి గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయాడు ఎమ్మెల్యే పోతులతోపాటు ఆయన అనుచరులను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కందుకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు.

దొనకొండలో పారిశ్రామిక పార్కు, సోమశిల ఉత్తర కాలువ, మున్నేటి కోట చెక్‌డ్యామ్‌ ఆధునికీకరణ పనులు చేపడుతామని తెలిపారు. కందుకూరులో ఆహార పార్కు మంజూరు చేస్తామని అన్నారు. పంటకుంటలు, సూక్ష్మ, బిందు సేద్యం, బీమా పథకాలన్నింటినీ సమీకృతం చేసే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని వివరించారు.

ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ.. నవ నిర్మాణ దీక్ష రోజునే టిడిపిలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందునే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

టిడిపిలో చేరిక

టిడిపిలో చేరిక

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే సుమారు 18మంది ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

టిడిపిలో చేరిక

టిడిపిలో చేరిక

తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన అనుచరులతో కలిసి గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.

టిడిపిలో చేరిక

టిడిపిలో చేరిక

ముఖ్యమంత్రి చంద్రబాబునాయాడు ఎమ్మెల్యే పోతులతోపాటు ఆయన అనుచరులను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కందుకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు.

టిడిపిలో చేరిక

టిడిపిలో చేరిక

దొనకొండలో పారిశ్రామిక పార్కు, సోమశిల ఉత్తర కాలువ, మున్నేటి కోట చెక్‌డ్యామ్‌ ఆధునికీకరణ పనులు చేపడుతామని తెలిపారు. కందుకూరులో ఆహార పార్కు మంజూరు చేస్తామని అన్నారు. పంటకుంటలు, సూక్ష్మ, బిందు సేద్యం, బీమా పథకాలన్నింటినీ సమీకృతం చేసే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని వివరించారు.

టిడిపిలో చేరిక

టిడిపిలో చేరిక

ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ.. నవ నిర్మాణ దీక్ష రోజునే టిడిపిలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందునే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు.

English summary
YSR Congress MLA Pothula Rama Rao on Thursday joined Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X