రైతు స్పెల్లింగ్ కూడా తెలియని రోజా మమ్మల్ని విమర్శించడమా?: సోమిరెడ్డి
ప్రతీ ఏటా గుంటూరు మిర్చి యార్డులో హమాలీలకు, గుమాస్తాలకు 40రోజుల పాటు సెలవులిస్తారని, ఇది ఎప్పటినుంచో జరుగుతోందని అన్నారు.
నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే రోజా రైతుల పక్షాన మాట్లాడుతూ టీడీపీని విమర్శించడాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతు అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియని రోజా.. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు తెలిసి రోజా ఇంతవరకు పొలానికి కూడా వెళ్లి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలో చెప్పే హక్కు రోజాకు లేదన్నారు సోమిరెడ్డి. ఇక మిర్చి గిట్టుబాటు ధర గురించి ప్రస్తావిస్తూ.. జగన్మోహన్ రెడ్డికి మిర్చి కొనుగోలుపై కనీస అవగాహన కూడా లేదన్నారు. ప్రతీ ఏటా గుంటూరు మిర్చి యార్డులో హమాలీలకు, గుమాస్తాలకు 40రోజుల పాటు సెలవులిస్తారని, ఇది ఎప్పటినుంచో జరుగుతోందని అన్నారు.

ఇదేదో తాము కొత్తగా కల్పించినట్లు, కావాలనే సెలవులు ఇచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇటీవలే హమాలీలతో సమావేశం నిర్వహించి, మానవత్వంతో రైతులకు సహకరించాలని ప్రభుత్వం తరుపున కోరామన్నారు. తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి హమాలీలు, గుమాస్తాలు మిర్చి కొనుగోలుకు సహకరిస్తున్నారని చెప్పారు. ఇదేమి తెలియకుండా జగన్ తనకు ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications