ఎపి విభజనపై మోడీ: అనిల్ గోస్వామితో సమీక్ష
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాబోయే దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజనపై ఆయన హోంశాఖ కార్యదర్సి అనిల్ గోస్వామితో సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఈ సమీక్ష బుధవారంనాడు పది నిమిషాల పాటు సాగినట్లు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీనాటికి కేంద్ర హోంశాఖ ఫైళ్లను పూర్తి చేయనుంది.
రాష్ట్ర విభజనకు సంబంధించిన కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని నరేంద్ర మోడీ గోస్వామిని ఆదేశించినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే ఉన్న నేపథ్యంలో మోడీ సమీక్ష నిర్వహించారు. మోడీ ఈ నెల 26వ తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీమాంధ్రకు భారీ ప్యాకేజీని ప్రకటించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో సీమాంధ్ర ప్యాకేజీని త్వరితగతిన పూర్తి చేయాలని మోడీ అనిల్ గోస్వామిని ఆదేశించినట్లు తెలుస్తోంది.
సీమాంధ్రకు కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అన్యాయం చేసిందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోడీ ప్రత్యేక ప్యాకేజీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.