Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల్లో ధనప్రవాహం: నెలరోజుల్లో రూ.4650 కోట్లు సీజ్..రోజుకు రూ.100కోట్లు.. ఏపీలో ఎంతంటే..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నగదు, మద్యం ఏరులై పారుతుంది. దేశంలో ఎలక్షన్ కోడ్ మొదలైన నాటి నుండి ఇప్పటివరకు భారీస్థాయిలో నగదు, మద్యం, నగలు పట్టుబడ్డాయి. అంతేకాదు డ్రగ్స్ కూడా పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్చి ఒకటవ తేదీ నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేస్తున్నట్టు భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ప్రతీరోజూ పట్టుబడుతున్న 100 కోట్ల నగదు
75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువులు జప్తు చేయడం జరిగిందని ఈసీ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికలు తొలిదశ ముందే భారీ స్థాయిలో నగదు ప్రవాహం కొనసాగుతుందని తాజా డేటా వెల్లడించింది. రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 4650 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

Money flow in elections Rs 4650 crore seized in a month 100 crores per day this is the data in AP

లోక్ సభ ఎన్నికల చరిత్రలో తొలిసారి
లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో సీజ్ చేసిన సందర్భాలు లేవని వెల్లడించింది. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు నగదు రూపంలో 395.39 కోట్లు, బంగారంతో పాటు ఇతర లోహాల రూపంలో 562.10 కోట్లు పట్టుబడ్డాయని పేర్కొంది.

మొత్తం పట్టుబడిన వాటిలో డ్రగ్స్ దే అగ్రస్థానం
ఇక మద్యం రూపంలో 489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. అత్యధికంగా డ్రగ్స్ రూపంలో 2068 . 85 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడినట్లు చెబుతోంది. అంటే మొత్తం పట్టుబడిన వాటిలో డ్రగ్స్ దే అగ్రస్థానం అని తెలిపింది. ఇక బహుమతుల రూపంలో 1142. 49 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది.

Money flow in elections Rs 4650 crore seized in a month 100 crores per day this is the data in AP

ఏపీలో 125. 97 కోట్లు స్వాధీనం,
ఇదిలా ఉంటే మార్చి ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు సగటున 100 కోట్ల మేరా పట్టు పడుతున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 125. 97 కోట్లు స్వాధీనం చేసుకోగా, తెలంగాణా రాష్ట్రం నుంచి 121.84 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఇక ఎన్నికలు తొలిదశ ముందే ఇలా ఉంటే ఎన్నికలు పూర్తయ్యే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+