మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు, తల్లి, సోదరి ఆత్మహత్యచేసుకొన్నారు,ఎందుకిలా?
చిత్తూరు జిల్లా వి.కోట మండలం దాసర్లపల్లిలో విషాదం చోటుచేసుకొంది. కొడుకు చేసిన పనికి తల్లీ కూతుళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిత్తూరు:చిత్తూరు జిల్లా వి.కోట మండలం దాసర్లపల్లిలో విషాదం చోటుచేసుకొంది. కొడుకు చేసిన పనికి తల్లీ కూతుళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని దాసర్లపల్లికి చెందిన అననూయమ్మ కొడుకు రెండు రోజుల క్రితం పక్కింట్లో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.
ఇది గమనించిన ఆ మహిళ కుటుంబసభ్యులు అతడిని కొట్టారు. ఈ ఘటనతో అనసూయమ్మ, ఆమె కుమార్తై తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు.

అయితే అనసూయమ్మకు ధైర్యం చెప్పేందుకుగాను పొరుగునే ఉండే మహిళ అనసూయమ్మ ఇంట్లో ఉంటోంది.ఆ మహిళ శుక్రవారం ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది.
ఇదే అదనుగా భావించిన అనసూయమ్మ, ఆమె కూతురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications