బాబుపై మోడీకి ఈర్ష్య, ద్వేషం, జగన్కు దమ్ముంటే ఈరోజే..: జేసీ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: విశాఖ రైల్వే జోన్పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ చిన్న అంశమే కానీ అది ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉందని ఆయన చెప్పారు.
Recommended Video

అంతేకాదు, రైల్వో జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్కు పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా జేసీ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఒక గట్టి నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.

బాబుపై మోడీకి ఈర్ష్య, ద్వేషం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ప్రధాని మోడీకి ఈర్ష్య, ద్వేషం ఉన్నట్లున్నాయని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అడిగినవన్నీ ఇస్తే చంద్రబాబు రాజకీయంగా ఎదిగిపోతారేమో అనే భయం ఉన్నట్లుందని, అందుకే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదేమో.. అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు...
అయితే కేంద్రం ఇచ్చిన హామీలు ఎలా సాధించుకోవాలో తమ పార్టీకి బాగా తెలుసునని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే టీడీపీ దీని గురించి నిర్ణయం కూడా తీసుకుందని, ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని ఎంపీ పేర్కొన్నారు.

దమ్ముంటే ఈరోజే చేయించు...
ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కూడా ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్కు దమ్ముంటే ఇవాళే వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు.

ఏప్రిల్లో రాజీనామాలు చేస్తే...
ఏప్రిల్లో తన పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తే ఆ తర్వాత ఉప ఎన్నికలు రావనేది వైఎస్ జగన్ ప్లాన్ అని, అందుకే ఆయన అలా చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ఏడాది క్రితం కూడా జగన్ ఇలాగే తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారని, మరి అదేమైంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

శివప్రసాద్ కళాకారుడు.. అందుకే అలా...
లోక్సభలో ఎంపీల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందన్న బీజేపీ నేత విష్ణుకుమార్రాజు వ్యాఖ్యలపైనా ఏంపీ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ శివప్రసాద్ కళాకారుడు కాబట్టే అలా చేశారని వివరణ ఇచ్చారు. తమ పోరాటం తర్వాత కేంద్రంలో కదలిక వచ్చిందని, మార్చి 5 నాటికి కొన్ని నిధులు వస్తాయని దివాకర్రెడ్డి తెలిపారు.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications