పురందేశ్వరికి కొత్త బాధ్యతలు- ఏపీ కేంద్రంగా మోదీ మార్క్ రాజకీయం..!!
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కూటమిలో మూడు పార్టీలు భాగస్వాములుగా కొనసా గుతూనే.. సొంతగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వరుసగా మూడో సారి కేంద్రం లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఈ సారి దక్షిణాది పైన ప్రత్యేకంగా గురి పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా తెలుగు వ్యక్తి కి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో వైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పదవి విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మోదీ మార్క్ నిర్ణయాలు
ప్రధాని మోదీ మిషన్ -2029 ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ సారి మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యూహాలు అమ లు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకం పైన నిర్ణయానికి వచ్చినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు పదవి విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికే పార్టీ జాతీయాధ్యక్ష పదవి దక్కుతుందని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పేరు ప్రస్తావనకు రాగా, మంత్రిగా కొనసాగేందుకే ఆయన మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఏపీ నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ఏపీ కేంద్రంగా రాజకీయం
బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఈ సారి ఆరెస్సెస్ నేపథ్యం క్రియాశీలకం కానుంది. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో మహిళకు ఇవ్వాలనే ఆలోచన సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, మహిళకు బీజేపీ పగ్గాలు దక్కుతాయా అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ అంశమే ఢిల్లీ కేంద్రంగా సంచలనంగా మారింది. ఇదే సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటుగా లోక్ సభ లో డిప్యూటీ స్పీకర్ పదవి పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తొలుత ఈ పదవి మిత్రపక్షాలకు ఇవ్వాలని భావించారు. అయితే, జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలతో దక్షిణాది నుంచి తమ పార్టీకి చెందిన వారికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
పురందేశ్వరికి కొత్త బాధ్యతలు
ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి ప్రమోషన్ దక్కనున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో సామాజిక సమీకరణాలను పార్టీ పరిశీలన చేస్తోంది. అందులో భాగంగా పురందేశ్వరిని మార్చాలని నిర్ణయిస్తే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయం కానున్నట్లు భావిస్తున్నారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం.. పార్లమెంట్ వ్యవహారాల పైన ఉన్న అనుభవంతో పురందేశ్వరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని ఢిల్లీ ముఖ్య నేతల్లో తాజాగా చర్చ మొదలైంది. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్న ప్రధాని మోదీ అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తూనే.. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణా మాలను తమకు అనుకూలంగా మలచుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ కేంద్రంగా వచ్చే వారం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications