వైసీపీ అభ్యర్దుల ఖరారుపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు వేగవంతం చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లను కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా..సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీట్లు రాని వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. ఇదే సమయంలో సీట్ల మార్పు..కొత్త వారికి అవకాశం పై పార్టీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
మార్పుల వెనుక : పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పార్టీని ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. తిరుపతి, చంద్రగరి అభ్యర్దులుగా ఇప్పటికే భూమన - చెవిరెడ్డి కుమారులకు ఖాయం చేసారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ నుంచి ఎంపీ అదాల బరిలోకి దిగనున్నారు. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నా...అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఛార్జ్ ల మార్పు తొలి జాబితాలోనే ప్రకాశం జిల్లాలో సీట్లలో మార్పులను ప్రకటించారు.

గెలుపే ప్రామాణికం : మంత్రులు ఆదిమూలపు సురేష్, నాగార్జునకు సీట్లు ఖరారు చేసారు. బాలినేని, మాగంటితో విజయ సాయిరెడ్డి సుదీర్ఘంగా చర్చలు చేసారు. తరువాత సీఎం వద్ద సమావేశం జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యేగా తిరిగి బాలినేని పోటీ చేయటం ఖాయమైంది. ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి లేదా ఆయన కుమారుడు పోటీ పైన ఇంకా నిర్ణయం జరగలేదు. గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. అద్దంకిలో హనిమిరెడ్డిని బరిలోకి దింపారు. దర్శి, గిద్దలూరులో సీట్ల పైన నిర్ణయం జరిగింది. దీంతో..ఇప్పుడు సాయిరెడ్డి పార్టీలో జరుగుతున్న పరిణామాలు..అభ్యర్దుల ఎంపిక వెనుక కారణాలను వెల్లడించారు.
Everything aside, only those MLAs who have performed in their constituencies, established a connect with their people, and nurtured/developed their areas will be given tickets. It is purely on the basis of merit that @YSRCParty tickets shall be given.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 29, 2023
సాయిరెడ్డి క్లారిటీ : నియోజకవర్గాల్లో ఎవరైతే సమర్ధత చాటుకున్నారో..ప్రజలతో మమేకం అయ్యారో..నియోజకవర్గాల్లో తమ ముద్ర వేసారో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని సాయిరెడ్డి స్పష్టం చేసారు. గెలుపే ప్రాతిపదికగా మెరిట్ ఆధారంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని సాయిరెడ్డి వెల్లడించారు. ఇంతకు మంచి మరే ఆలోచన లేదని సాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. దాదాపు 30 నియోజకవర్గాల వరకు మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో 11 మందిని మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం మార్పులతో ఈ రోజు లేదా రేపు వైసీపీ అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, ఈ మార్పుల పైన వైసీపీ ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications